సాలమ్మ అనే మహిళా రైతు అనంతపురం జిల్లా తలపుల మండలం ఒదుల పల్లి పంచాయితి గొల్ల పల్లి తాండ నివాసి. ఈమె భర్త 15 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఈమెకి 10 మంది సంతానం 4 కుమారులు 6 మంది కూతుర్లు. భర్త చనిపోయిన తరువాత చిన్న కొడుకు దగ్గర, జీవనం కొనసాగిస్తూ వుండేది. …
ఉమా దేవి అనంతపురం జిల్లా తలపుల మండలం, ఒదుల పల్లి పంచాయితి, గొల్ల పల్లి తాండా గ్రామ నివాసి. ఈమె భర్త లారీ డ్రైవర్. వీరికి 4 ఎకరాల సొంత భూమి వుంది. ఆ భూమిలో వీరు ప్రధానంగా వేరుసెనగ పంటను సాగు చేసేవారు. నీటి వసతి కోసం వీరు వారి పొలంలో బావి త్రవ్వుకున్నారు. …
కడప జిల్లా పేరు చెబితేనే, కరువు చేసే కరాళ దృశ్యాలు కళ్లముందు సాక్షాత్కారమవుతుంది. అలాంటి కడపలో కన్నీళ్లు పారడం కాదు, కందులు పండించడం కూడా సాధ్యమేనంటున్నారు ఇక్కడి శ్రమజీవి. సుస్థిర వ్యవసాయ కేంద్రం సాయంతో, పెట్టుబడిలేని వ్యవసాయ పద్ధతిలో, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. భూమినే నమ్ముకున్న వారు కొత్త ఆశలతో మరోసారి మట్టిని తమ …
శిక్షణ, అవగాహన ఈ రెండు అంశాలు యువ రైతు మిత్రులకు సాగులో ఓ కొత్త ఆలోచనను కలిగిస్తాయని మరోసారి రుజువైంది. రసాయన సాగు నుండి సేంద్రియం వైపు అడుగులు వేసి, అందరూ అభినందించేలా శ్రమిస్తున్న గంగాభవాని అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా మన ముందు నిలిచింది. పట్టుమని పాతికేళ్లు లేని గంగాభవానిది కడప జిల్లాలోని, వేంపల్లె మండలంలోని, …
గోపిచంద్ నవల ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’, తండ్రి రాసిన వీలునామాను కొడుకులు చదవడంతో మొదలవుతుంది. ఆ వీలునామా ‘వందేళ్ల క్రిందట వున్నవారు ఇప్పుడు లేరు, ఇప్పుడు వున్నవారు వందేళ్ల తరువాత వుండరు’ అని ప్రారంభమవుతుంది. ఈ సాధారణ సూత్రానికి కొన్ని అసాధారణ మినహాయింపులు వుంటాయి. మొన్న తుది శ్వాస విడిచిన బి.ఎన్. యుగంధర్ గారు …
కార్మిక మంత్రిత్వశాఖ 17 సెప్టెంబర్ 2019న, మంత్రిత్వశాఖ వెబ్సైటులో ప్రచురించిన కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఫైల్ నెం. జెడ్-13025/13/2015-ఎల్.ఆర్.సి మీద అక్టోబర్ 24, 25 తేదీలలో జాతీయ స్థాయిలో వివిధ కార్మిక సంఘాలు స్వచ్ఛంద సంస్థలు, సంఘటిత, అసంఘటిత, గృహ ఆధార కార్మికుల ప్రతినిధులతో చర్చను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చర్చ ముఖ్య …
జన్యుమార్పిడి పంటల గురించి దేశంలో తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపధ్యంలో ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి పంటలకు అనుమతిని ఆపాలని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు నవంబర్ 20న రాసిన లేఖలో కోరారు. సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణుల కమిటీ నివేదికలో ఇచ్చిన సూచనలను భారత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని, సాంకేతిక కమిటీలోని మెజారిటీ సభ్యులు సూచించినట్లు …
”తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్” అన్నాడు మహాకవి గురజాడ.. దేశంలో ఆహార పంటల ఉత్పత్తి పెరిగిందనీ, ప్రభుత్వాల దగ్గర ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయనీ ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దేశంలో కరువు కాటకాలు, ఆహార కొరతను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం దగ్గర బియ్యం బఫర్ స్టాక్ 13.58 మిలియన్ టన్నులు ఉండాల్సి వుండగా, …
అత్యధిక ఇంధనాలను వాడి ఫ్యాక్టరీలలో తయారు చేసే రసాయన ఎరువులు, విష పూరిత రసాయన కీటక నాశనులు ఇప్పటికే పర్యావరణంపై, అన్ని జీవ జాతుల ఆరోగ్యంపై చూపిస్తున్న దుష్ప్రభావాలను మనం అనుభవిస్తున్నాం. రసాయన ఎరువులను రైతులకు అందించడానికి దేశ బడ్జెట్లో అత్యధిక నిధులను కేటాయించడాన్ని కూడా మనం చూస్తున్నాం. పైగా ఈ రసాయన ఎరువుల ధరలు …
మంచి విత్తనాలే మంచి దిగుబడులిస్తాయి – డా॥ జి.రాజశేఖర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం అధిక దిగుబడులు సాధించడానికి అవసరమైన వుత్పాదకాన్నింటిలోకీ విత్తనం అతి ముఖ్యమైనది. వ్యాస మహర్షి తండ్రి ఋషి పరాశరుడు ‘‘అత్యధిక దిగుబడులకు మూలం విత్తనం’’ అని అన్నారు. విత్తన స్వచ్ఛత కొనసాగించాలంటే విత్తనాలను మూడు సంవత్సరాలకు ఒకసారి నాణ్యమైన, జన్యు శుద్ధి కలిగిన …